|
|
 |
ముంబయి : వాంఖడే స్టేడియంలో జరిగిన ఫ్యూచ్ ర్ కప్ చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుపై భారత్ 2 వికె ట్ల తేడాతో విజయం సాధించింది, జహీర్ ఖాన్ చివరివరకు పోరాడి భారత్ ను ఓటమినుంచి తప్పించి విజయాన్ని ఆందిచాడు. ఒక దశలో 64 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ను ఊతప్ప 59 బంతుల్లో 47 మరియు హర్బజన్ సింగ్ 49 బంతుల్లో 19 ఇద్దరు కలిసి 7 వ వికెట్ కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 129 పరుగుగవద్ద ఊతప్ప వికెట్ కోల్పోయిన భారత్ వెంటనే హర్బజన్ వికెట్ కూడా కోల్పోయింది. అప్పటికి భారత్ స్కోర్ 35.4 ఓవర్లలో 143 పరుగులకు 8 వికెట్లు ఈ దశలో వచ్చిన జహీర్ ఖాన్ మరియు మురలీ కార్తీక్ లు ఆచీతూచీ ఆడుతూ భారత్ కు విజయాన్ని అందించారు. వీరు 62 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆస్టేలియా బౌలర్లలో జాన్ సన్ 3, బ్రాకెన్ 2 వికెట్లు,బ్రెట్లీ, హొప్స్ మరియు క్లార్క్ ఒకొక్క వికెట్ చొప్పున పంచుకున్నారు. ఈ విజయంతో ఆస్టేలియా ఆధిక్యం 4-2 కు పడిపోయింది. అద్భుత బౌలింగ్ తో 6 వికెట్ లు తీసుకుని ఆస్టేలియా నడ్డి విడిచిన కారిక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లబించింది.ఈ సిరీస్ లో అద్భుత ప్రతిభ కనబరచిన సైమాండ్స్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
|
|