నోబెల్ ప్రైజ్ గాధ !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

    ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా భావించే బహుమతుల్లో నోబెల్ ది ప్రధమ స్ధానం. అందులోనూ మానవాళి శాంతి కోసం కృషి చేసినవారికి ఇచ్చే శాంతి బహుమతి అంటే ప్రత్యేక గౌరవం. ఈ తరుణంలో నోబెల్ శాంతి బహుమతిపై ప్రత్యేక కధనం మీ కొసం.. స్వీడెన్ పారిశ్రామికవేత్త "ఆల్ఫ్రెడ్ నోబెల్" తన వీలునామాలో ప్రకటించిన ఐదు నోబెల్ పురస్కారాల్లో శాంతి బహుమతి ఒకటి. 1896లోనే అల్ఫ్రెడ్ మరణించినప్పటికీ, 1901 నుంచి ఈ పురస్కారాలను ఇవ్వడం ప్రారంభించారు. విధ్వంసాన్ని సృష్టించే డైనమైట్ ను కనిపెట్టినందుకు పరిహారంగా ఈ బహుమతులను ఇవ్వాల్సిందిగా నోబెల్ తన వీలునామాలో పేర్కొన్నాడనేది విమర్శకుల అభిప్రాయం. 1901 నుంచి భౌతిక, రసాయన, వైద్య శాస్త్రం, సాహిత్యం, శాంతి కోసం విశేషంగా కృషి చేసినవారికి ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. 1969 నుంచి ఆర్ధిక శాస్త్రంలోనూ నోబెల్ ను ఇవ్వడం మొదలుపెట్టారు. రాయల్ స్వీడిష్ అకాడమీ శాంతి బహుమతి మినహా మిగతా అవార్డులను అందజేస్తుంది. శాంతి పురస్కారం కోసం ప్రత్యేకంగా నార్వే ఓ కమిటీని నియనిస్తుంది. వాళ్లే విజేతకు బహుమతిని అందజేస్తారు. మొదటిసారి ఈ పురస్కారాన్ని 1901 లో స్విడ్జర్లాండ్ కు చెందిన సంఘ సంస్కర్త హెన్రీ డ్యునాంట్ అందుకున్నారు. రెడ్ క్రాస్ స్దాపనకు స్ఫూర్తిగా నిలిచినందుకు హెన్రీ ఈ అవార్డును పొందారు. ఇప్పటివరకూ 94 మంది వ్యక్తులు, 19 సంస్ధలకు ఈ గౌరవం దక్కింది. ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే నోబెల్ బహుమతిపై కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి. అడాల్ఫ్ హిట్లర్, బెన్నిటో ముస్సోలినీ, స్టాలిన్ ఈ శాంతి గౌరవానికి నామినేట్ అయ్యి సంచలనం సృష్టించారు. వీరిలో హిట్లర్ పేరు 1930 లో పరిశీలకు వచ్చింది. అంతేకాకుండా, భారత జాతిపిత మహాత్మాగాంధీ ఐదు సార్లు ఈ బహుమతికి నామినేట్ అయినా, ఒక్కసారి కూడా ఈ పురస్కారాన్ని అందుకోలేకపోయారు. దేశాల మధ్య శాంతికోసం కృషి చేసిన వారికి, సైన్యాల తగ్గింపునకు పాటుపడినవారికి లేదా, శాంతిని ప్రచారం చేసినవారికి బహుమతి దక్కాలనేది ఆల్ఫ్రెడ్ నోబెల్ అభిప్రాయం.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.