|
భారతీయ రైల్వే కంట్రోల్ ఛార్టింగ్ సిస్టమ్(సీసీఎస్)ను అందుబాటులోకి తీసుకురానుంది.జాతీయ రైల్వే విచారణ విభాగంలో త్వరలో ప్రవేశపెట్టనున్న ఐటీ ఆధారిత ఈ కొత్త విధానం వల్ల రైళ్ళు రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగా అందించేలా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందచడమే దీని ముఖ్య ఉద్దేశం . సమాచార వ్యవస్థ మేనేజింగ్ డైరెక్టర్ మాదవ్ పాఠక్ ఈ సిస్టం ప్రవేశపెట్టడంపై వివరించారు. రైళ్ల రాకపోకలకు సంబంధించి ఓ స్టేషన్ నుంచి మరో స్టేషన్కు సమాచారం అందించడం ఇప్పటివరకు మానవ ఆధారితంగానే నిర్వహిస్తున్నందున కొద్దిపాటి జాప్యం ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా ప్రయాణికులకు రైళ్ల రాకపోకల సమాచారం అందించడంలో జరిగే జాప్యాన్ని నివారించేందుకి ప్రస్తుతం ప్రవేశపెట్టనున్న సీసీ సిస్టమ్ చక్కగా ఉపయోగపడుతుందని సుమారు రూ. 86 కోట్లతో చేపట్టనున్న ఈ వ్యవస్థను దేశంలోని అన్ని రైళ్లలోనూ ప్రవేశ పెట్టనున్నట్టు ఆయన చెప్పారు.
|