|
|
|
ఎల్టీటీఈ రాజకీయ విభాగం నేత తమిళ్ సెల్వన్ మృతికి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సంతాపం ప్రకటించడంపై అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ధ్వజమెత్తారు. నిషేధిక ఎల్టీటీఈ సంస్థకు మద్దతు పలకడం ద్వారా ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. చెన్నైలో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ శ్రీలంక వాయుసేన కాల్పుల్లో మరణించిన తమిళ్ సెల్వన్ ను ప్రశంసించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజీవ్ గాంధి హత్య కేసులో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ నేరస్తుడిగా ఉన్న తరుణంలో ఆ సంస్థకు చెందిన సెల్వన్ ను ఎలా ప్రశంసిస్తారని ప్రశ్నించారు. ఎల్టీటీఈతో కరుణానిధికి సంబంధాలు ఉందని, ఆ సంస్థకు ఆయన సాయం చేస్తున్నారన్న విషయం ఈ చర్య ద్వారా బయటపడిందని తెలిపారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగిన డీపీఐ కార్యకర్త ఖైదుపై కరుణానిధి మాట్లాడకపోవడం కూడా ఆయన ఎల్టీటీఈకి సాయం చేస్తున్నారన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు ఉందని చెప్పారు.
|
|