|
|
 |
తమిళనాడు పీసీసీ చీఫ్ కృష్ణస్వామి అకస్మాత్తుగా జరిగిన ధాడిలో కత్తిపోట్లకు గురయ్యారు. రామనాధపురం జిల్లాలో పది మంది సభ్యుల ముఠా ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డగించి, ఆయన భుజం,ఛాతీ పై కత్తితో పొడిచారు. ఆయనతో పాటు ఆ కారులో ప్రయాణం చేసిన మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పసుంపొన్ గ్రామంలో జరిగిన ముత్తు రామలింగ దేవర్ శత జయంత్యుత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తిరిగి అక్కడి నుంచి మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు కారులో వెళుతుండగా ఈ దాడి జరిగింది. విషయం తెలుసుకున్న మరు క్షణం లో అక్కడకు చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణస్వామిని పరమకుడి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. అక్కడి నుంచి తర్వాత మదురై అపోలో ఆస్పత్రికి తరలించారు.
|
|