|
|
 |
తెలుగు దేశం పార్టీ ప్రధానాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రైతు సమస్యలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ వీరప్ప మొయిలీ విరుచుకుపడ్డారు. రైతు సమస్యల పరిష్కారం కన్నా ఆ సమస్యలను రాజకీయం చేయాలన్నదే బాబు ప్రధానోద్దేశంగా కన్పిస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం బాబు తప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు. రైతు సమస్యలపై ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రితోనే ఈ విషయం మాట్లాడే వారని చెప్పారు. అంతేకాక యూఎన్పీఏ సమావేశం కోసం ఢిల్లీ వచ్చి, ప్రధానిని అపాయింట్ మెంట్ కోరడమేంటని ప్రశ్నించారు. అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని గగ్గోలు పెట్టడం సరికాదన్నారు.
|
|