వరి మద్దతు ధరకై శరద్ పవార్ ను కలసిన బాబు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం న్యూఢిల్లీలో కలిశారు. వరికి మద్దతు ధరగా రూ.1000 కల్పించాలని ఈ సందర్భంగా చంద్రబాబు పవార్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పవార్ బాబుకు హామీ ఇచ్చినట్టు ఇచ్చారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు వెంట పలువురు తెదేపా నేతలు కూడా ఉన్నారు.