ముంబై లో పటిష్ట భద్రత
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన బాంబు పేలుళ్ళ నేపథ్యంలో ముంబైలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. వరుసగా హైదరాబాద్, అజ్మీర్, లూథియానా నగరాల్లో జరిగిన పేలుళ్ళ దృష్ట్యా అప్రమత్తమైన ముంబై పోలీసు శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నా ప్రస్తుత పేలుళ్ళ నేప«థ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు ముంబై పోలీస్ కమీషనర్ డి.ఎన్.జాదవ్ విలేఖర్లకు తెలిపారు.