|
|
 |
|
శ్రీకాంత్, ఛార్మి హీరోహీరోయిన్లుగా సిల్వర్ స్క్రీన్ మూవీస్ పతాకంపై ఓ చిత్రం ప్రారంభమైంది. రాజు, ప్రవీణ్, మన్నం వెంకటరమణ, యార్లగడ్డ వెంకటరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిధి ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం అన్నపూర్ణస్టూడియోలో హీరోహీరోయిన్లపై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. దీనికి దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేశారు. పూరీ జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ... "ఆపరేషన్ దుర్యోధన", "యమగోల మళ్ళీ మొదలైంది" తర్వాత చేస్తోన్న ఈ చిత్రం హ్యాట్రిక్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. నిధిప్రసాద్తో తనకిది రెండవ చిత్రమని, పూర్తివినోదభరిత చిత్రమిదని చెప్పారు. దర్శకుడు నిధిప్రసాద్ మాట్లాడుతూ.. "భాగ్యలక్ష్మి బంపర్ డ్రా" తర్వాత చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్, కామెడీ, ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని వెల్లడించారు. ఇందులోని ఆరు పాటలూ రికార్డింగ్లో ఉన్నాయని తెలిపిన ఆయన హైదరాబాద్, గోవా, వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేస్తామని అన్నారు. తాను "భాగ్యలక్ష్మి బంపర్ డ్రా"లో నటించానని, అంతటి విజయాన్ని ఈ చిత్రం చవిచూస్తుంగని కొండవలస ఆకాంక్షించారు. పాత్రలకనుగుణంగా విలన్లుకూడా కామెడీని పండిస్తారని బెనర్జీ చెప్పారు.
|
|