|
ప్రపంచంలో అతిపెద్ద ప్రయాణిక విమానం ఎయిర్బస్ ఏ380 తొలిసారిగా ప్రయాణికులతో నింగిలోకి ఎగిరింది. సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి బయలుదేరిన ఈ విమానంలో 450 మంది ప్రయాణికులున్నారు. ఓ వారం క్రితం ఎయిర్బస్ నుంచి ఈ విమానాన్ని సింగపూర్ ఎయిర్లైన్స్ పొందింది. 850 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం కలిగిన ఈ ఎయిర్బస్ ఏ380 విమానం ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద విమానంగా గుర్తింపు పొందింది. నాలుగు దశాబ్దాల నుంచి సాగుతున్న బోయింగ్ 747 హవా ఈ కొత్త సూపర్జంబోతో అంతం అయ్యే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. అనేక నిర్మాణ పరమైన సమస్యలతో రెండేళ్ల ఆలస్యంగా బయటికొచ్చిన ఎయిర్బస్ ఏ380 బుధవారం తొలిసారి ప్రయాణికులతో సిడ్నీ బయలుదేరి వెళ్లింది.
|